🙏తల్లి మాటలోని మహత్తు!!*
_*అనగనగా ఒక బాలుడు. అతడికి జట్కాబండిలో ప్రయాణించడమంటే చాలా ఇష్టం. అతడు ఇంటినుంచి రోజూ బడికి వెళ్లేది జట్కాలోనే. పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారని బడిలో పిల్లల్ని టీచరు అడిగారు. ఒకరు డాక్టరవుతానని, ఇంకొకరు ఇంజినీరవుతానని, మరొకరు లాయరు అవుతానని చెబుతుండగా, ఈ బాలుడు మాత్రం జట్కావాలా అవుతానని జవాబిచ్చాడు.*_
_*టీచరు, పిల్లలు గొల్లున నవ్వారు*_.
_*బాలుడు ఇంటికి చేరే లోపలే ఈ కబురు ఊరికీ, ఊళ్లోని తల్లికి అందిపోయింది.*_
_*ఇంటికి రాగానే తల్లి ప్రశాంతవదనంతో బాబూ! పెద్దయ్యాక ఏమవుదామనుకుంటున్నావని అడిగింది. అతడు పాత సమాధానమే చెప్పాడు. ఆమె తప్పకుండా అవుదువుగానీ, ఇలా రా అంటూ పూజామందిరం తలుపులు తెరిచింది.*_
_*ఒక్క గుర్రంతో నడిపే బండిని కాదు బాబూ, నాలుగు గుర్రాలు నడిపే బండీకి నువ్వు జట్కావాలావి కావాలి, అదిగో, ఆ శ్రీకృష్ణుడిలాగా - అని బోధించింది ఆ తల్లి..*_
*ఆ నాలుగు గుర్రాల పేర్లు ధర్మ, అర్థ, కామ, మోక్షాలనీ, ఆ విషయాలను బోధించే జట్కావాలా జగద్గురువైన శ్రీకృష్ణుడనీ చెప్పింది. నువ్వు కూడా జగత్తుకి ఈ నాలుగింటిని బోధించే గురువువి కావాలి, సరేనా! అంటూ అతడి ఆలోచనను చక్కని మలుపు తిప్పింది.*_
_*ఆ బిడ్డడే పెరిగి పెద్దయ్యాక వివేకానందుడుగా మనందరికీ తెలిసిన నరేంద్రుడు.*_
🙏 నిజమైన పెంపకం అంటే అదే. పిల్లలు తెలియక తప్పు చేసినా తప్పు మాట్లాడిన దానిని సరిదిద్దాల్సిన ది తల్లి అందుకే అమ్మని తొలి గురువు, తొలి దైవం అంటారు......
నిజంగా, అమ్మ మాటలో
ఎంత మహత్తు వుంది కదా!🧘♂