ఒక అడవిలో రెండు పిల్లులుండేవి.అవి రెండూ స్నేహితులు. ఒక రోజు రెంటికీ ఓ చోట రొట్టె కనిపించింది. దాన్ని ఆ రెండూ ఎలా పంచుకోవాలా అని ఆలోచించాయి. తనకు పెద్ద ముక్క కావాలంటే తనకు కావాలని దెబ్బలాడుకోసాగాయి. ఇంతలో అటుగా వెళుతున్న కోతి ఒకటి వాటికి కనిపించింది. దాన్ని పిలిచి జరిగిన విషయాన్ని చెప్పాయి. అప్పుడు ఆ కోతి ఓస్ ఇంతేనా మీకెందుకు నాకు విడిచిపెట్టండి అని చెప్పి రొట్టెను తన చేతుల్లొకి తీసుకుంది కోతి. ఎక్కడి నుంచో ఒక త్రాసు తెచ్చింది.రొట్టెను రెండు ముక్కలు చేసి త్రాసులో రెండు వైపులా పెట్టింది. త్రాసు కుదివైపు మొగ్గటంతో 'ఈ ముక్క పెద్దదైనట్టుందే' అని కుడివైపునున్న ముక్కను కాస్త తినేసింది.
ఈ సారి ఎడమవైపు ఉన్న ముక్కవైపు చూసి ఇప్పుడు ఇది పెద్దదైపోయింది. అని దానిలో కూడా కొంత బాగం తినేసింది. ఇలా ఒక్కో
ముక్కా కొంచెం కొంచెం తినేస్తూనే వాటికి రొట్తెను పంచుతున్నట్టు నాటకమాడింది. కోతి తినేస్తుంటే బాధగా ఉన్నా తమకు సమానమైన
ముక్కలు వస్తాయని పిల్లులు మాత్రం ఆశగా చూడసాగాయి. చివరికి కోతి రొట్టె మొత్తం తినేసి ఎంచక్కా తన దారిన తాను వెళ్ళి పోయింది. అప్పటికి గాని పిల్లులకు తాము చేసిన తప్పు అర్ధం కాలేదు. స్నెహితులమై ఉండి కూడా చిన్న రొట్టె ముక్క కోసం తగవులాడుకున్నాం. ఎలాగోలా పంచెసుకుని ఉంటే అది మన మద్యనే ఉండేది. ఇద్దరమూ తినక మొత్తం రొట్తెను కోతిని పిలిచి మరీ ఇచాము అని తమను తామే నిదించుకుని బాదపడ్డాయి.