తమిళనాడు రాష్ట్రంలోని నాగర్కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయం ఉంది.
అదే ‘శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం’.
ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా...
‘పిట్ట కొంచం కూత ఘనం’ అన్నట్టు,
ఈ ఆలయం ఘనత మాత్రం చాలా గొప్పది.
అందుకు కారణం ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన ‘వినాయకుడు’ ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం.
ఉత్తరాయణ కాలంలో (మార్చి నుంచి జూన్) వరకూ
ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు.
దక్షిణాయన కాలంలో (జూలై నుంచి ఫిబ్రవరి) వరకూ తెల్లని రంగులో ఉంటాడు.
ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని భక్తుల విశ్వాసం.
అంతే కాదు, ఇక్కడ మరో విచిత్రం కూడా వుంది.
ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే.
కానీ అది మిగతా చోట్ల మాటేమోగానీ..,
నా దగ్గర మాత్రం అది చెల్లదు అంటుంది
ఇక్కడున్న ఈ బావి.
ఇక్కడ వున్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే..,
ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది.
వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో..,
ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి..,
వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో..,
ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి.
అంతేకాదు, ఇంతకన్నా మరో విచిత్రం కూడా ఉంది. సాధారణంగా శిశిరఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం.
కానీ, దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు.
అవి ఎప్పుడూ సతతహరితాలే.
కానీ, ఈ ఆలయంలో ఉన్న మఱ్ఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి,
ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది.
అందుకే ఈ ఆలయాన్ని ‘మిరాకిల్ వినాయకర్ ఆలయం’ అని కూడా పిలుస్తారు.
ఈ ఆలయం ప్రతిష్ఠ కూడా ఆగమశాస్త్రానుసారం జరగలేదు. ఒక రాతిపీఠం మీద అతి సాధారణంగా
ఈ వినాయక విగ్రహాన్ని స్థాపించారు.
అయినా ఈ ఆలయం ఇంత ప్రఖ్యాతి చెందడానికి
ఈ వినాయకుని మహిమే కారణం అంటారు భక్తులు.
ఈ ఆలయ ప్రాకార గోడల మీద అతి పురాతరమైన వర్ణచిత్రాలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తాయి.
ఈ వినాయకునికి ఉదయము, సాయంకాలము కూడా అభిషేకాలు జరుగుతూండడం విశేషం.
ఓం గం గణపతయే నమః