పూర్వం ఒక రాజుగారికి విచిత్రమైన
ప్రకటనలు చేయటం సరదాగా ఉండేది.
ఒకసారి ఆయన అతి పెద్ద అబద్ధం
చెప్పిన వారికి 500 బంగారు నాణాలను బహుమతిగా ప్రకటించాడు.
ఎందరో రాజాస్ధానానికి వచ్చ్హి అబద్ధలు చెప్పారు. కాని ఎవరూ బహుమతిని అందుకునేంత పెద్ద అబద్ధం చెప్ప లేదని ఆ రాజు భావించాడు.
ఒక రోజు, రాజు తన సింహాసనంపై కూర్చుని ఉండగా, ఒక యువకుడు వచ్చాడు.
ప్రభూ! మీరు ఒక విషయానికి బహుమతి ప్రకటించారని విన్నాను
అని అడిగాడు
అవును. అతిపెద్ద అబద్ధం చెప్పిన వారికి 500 బంగారు నాణాలు కాని దానికన్నా ముందు మీరు 1000 బంగారు నాణాలు బహుమతిగా
ఇస్తానని ప్రకటించారు వాదించాడు యువకుడు.
పెద్ద అబద్ధం. నేనెప్పుడూ అలా
ప్రకటించలేదు యువకుడి ఆలోచన
పసికట్టలేని రాజు వెంటనే అన్నాడు.
అప్పుడా యువకుడు ప్రభూ! మీరే
ఒప్పుకున్నారు. నేను అతి పెద్ద అబద్ధం చెప్పానని. కాబట్టి దయచేసి 500 బంగారు నాణాలు బహుమతిగా ఇప్పించండి అన్నాడు.
రాజుగారు అతని చతురతకి ముచ్చటపడి 500 బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చాడు.
నీతి :సమయస్పూర్తితో కూడిన చతురత అన్నివేళలా విజయం సాధిస్తుంది.